క్యాన్సర్ తో బాధపడుతున్న సత్తిబాబుకు జనసేన సాయం
అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట నియోజకవర్గం, కోటవురట్ల మండలం, బాపిరాజు కొత్తపల్లి గ్రామంలో క్యాన్సర్ తో బాధపడుతున్న వేములపూడి సత్తిబాబుకు జనసేన ఆధ్వర్యంలో 25 కేజీలు బియ్యం, పండ్లు మరియు 1000రూ.ల ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటపూరం గ్రామ అధ్యక్షుడు గొల్లు బాలరాజు, గ్రామ ప్రధాన కార్యదర్శి రావాడ స్వామి, అశోక్ రెడ్డి , గెడ్డం రాజు, బీ శివాజీ, కొడవటిపూడి శీను, బాపిరాజు, కొత్తపల్లి జనసైనికులు పాల్గొనడం జరిగింది.