భువనేశ్వరి నగర్లో జనసేన ఇంటింట ప్రచారం

మదనపల్లె, ఎగువ కురవంకలోని భువనేశ్వరి నగర్లో శనివారం జనసేన ఇంటింట ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, తులసి శ్రీనివాస్, దారం హరి ప్రసాద్, గుమ్మిశెట్టి గోపాలకృష్ణ పట్టణ ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి గని, శంకర, చందు, గుణ, తెలుగుదేశం తరఫున కురువంక మాజీ సర్పంచ్ పసుపులేటి మోహన తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి వినోద్ కుమార్, ఈశ్వర్, పెద్ద ఎత్తున జనసైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు మరియు వీర మహిళలు పాల్గొన్నారు.