కంభం మండలంలో జనసేన

  • నాలుగవ రోజు జనంలోకి జనసేన కార్యక్రమం

ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం, కంభం మండలం పెద్ద నల్లకల్వ గ్రామంలో జనసేన ఇంచార్జ్ బెల్లంకొండ సాయిబాబు ఇంటి ఇంటికి వెళ్లి గ్రామ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బెల్లంకొండ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జనసేన పార్టీ కౌలు రైతులు 3000 మందిని గుర్తించి ప్రతి కుటుంబానికి ఒక లక్ష రూపాయల చొప్పున ప్రకాశం జిల్లాలో 77లక్షల రూపాయలు ఇవ్వటం జరిగిందని గ్రామస్థులకు తెలియపరిచారు. జనసేన పార్టీకి ఓటు వేస్తే ప్రజలకు అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.