వరుస సమావేశాలతో స్పీడ్ పెంచిన జనసేన

పెడన: కృత్తివెన్ను మండలం, పోడు గ్రామంలో బుధవారం పోడు గ్రామస్తులతో కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు, కృష్ణాజిల్లా కార్యదర్శులు కూనసాని నాగబాబు, ఒడిని జయరాజ్, కాజా మణికంఠ, అడ్డాల చంద్రశేఖర్, డొంకిన సతీష్, పళ్లెం బాల యేసు, పళ్లెం సురేష్, ఏనుగు బ్రహ్మాజీ, పడవల దీపక్, నిడదవోలు నరసింహారావు, డొంకిన దుర్గాప్రసాద్, తోట ప్రసాద్, మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల మహా సంగ్రామానికి జనసైనికులను సమయుక్తం చేసే కార్యక్రమంలో భాగంగా పెడన నియోజవర్గ జనసేన నాయకులు వివిధ గ్రామాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పోడు గ్రామంలో కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కూనసాని నాగబాబు మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జనసైనికులు అందరూ ఒక తాటిపై వచ్చి అభ్యర్థి ఎవరైనాప్పటికీ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. తదుపరి ఎస్ వి బాబు మాట్లాడుతూ పెడన నియోజకవర్గంలో జనసేన పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందని తెలియజేశారు. గత నాలుగు సంవత్సరాల నుంచి జనసేన పార్టీ నాయకులు నియోజకవర్గం అనేక పోరాటాలు చేశారని, అనేక ప్రజా సమస్యలపై తమ గళాన్ని విప్పారని ఈ సందర్భంగా తెలియజేశారు. నియోజకవర్గ స్థాయిలో ఉన్న అనేక సమస్యలను జనసేన పార్టీ మాత్రమే తీర్చగలుగుతుందని అందువల్ల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ జనసేన పార్టీ విజయానికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని తెలియజేశారు.