మజ్జి వెంకటేష్ కు జనసేన నాయకుల అభినందనలు

  • జనసేన – టీడీపీ బలోపేతానికి ఉమ్మడి కార్యాచరణకు చర్చ
  • త్వరలో మున్సిపాలిటీ వార్డ్ పర్యటన, సమస్యలపై పోరాటం

పార్వతీపురం: టిడిపి జిల్లా కార్యదర్శిగా నిమితులైన మజ్జి వెంకటేష్ కు అభినందనలు తెలుపుతూ శాలువా కప్పి సన్మానించిన పార్వతీపురం జనసేన పార్టీ నాయకులు చందక అనీల్, గోర్లి చంటి, రాజాన రాంబాబు, మానేపల్లీ ప్రవీణ్, సింగుమహంతి దినేష్, వంశీ తదితరులు. అనంతరం జనసేన – టిడిపి ఎలా బలోపేతం చేయాలి. ఇకపై చేయవలసిన కార్యక్రమాలు పోరాటాల గురించి చర్చించడం జరిగింది. అలాగే పట్టణంలో ఉన్న 30వార్డులలో పర్యటన, ప్రజల సమస్యల దిశగా ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశాలపైన చర్చించారు. అనంతరం ఇరు పార్టీ నాయకులు మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వంలో ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారు అని, ఈ వైసీపీ దుర్మార్గ పాలన నుంచి విముక్తి పొందడం కోసం ప్రజలు కూడా ఎలెక్షన్స్ ఎప్పుడువస్తాయో అని ఎదురుచూస్తున్నారు అని ఎదేవ చేశారు. 2024లో ఉమ్మడి ప్రభుత్వం స్ధాపిస్తాది అని జనసేన – టీడీపీ ఉమ్మడి పార్టీ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదని ఇరుపక్షాల నాయకులు నమ్మకంతో చెప్పారు.