తెలికిచర్ల గ్రామములో క్రీయాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి వివరించిన జనసేన నాయకులు

గోపాలపురం, జనసేన పార్టీ క్రీయశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగముగా గోపాలపురం నియోజకవర్గము, నల్లజర్ల మండలము తెలికిచర్ల గ్రామములో నల్లజర్ల మండల జనసేన పార్టీ అధ్యక్షులు చోడసాని బాపిరాజు ఆధ్వర్యంలో తెలికిచర్ల జనసేన నాయకులు, జనసైనికులు సభ్యత్వ కార్యక్రమాన్ని కార్యకర్తలకు, గ్రామ ప్రజలకు వివరించి.. ప్రతి ఒక్కరూ జనసేన పార్టీలో చేరి క్రీయాశీలక సభ్యత్వము నమోదు చేయించకోవాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొంటువంటి జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాంట్రాపాటి రాజు మాట్లాడుతూ కార్యకర్తల కుటుంబాలకు అండగా వుండే విధముగా మన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ క్రీయాశీలక సభ్యత్వం ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ కార్యకర్తల కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పారు. ఆలాగే పార్టీకి సంబంధించిన ముఖ్య విషయాలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రానున్న 2024 ఎన్నికల్లో జనసేనపార్టీ అధికారం సాధిస్తుందని పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే పొత్తు ఉంటుంది అని చెప్పారు. నల్లజర్ల మండల అధ్యక్షులు చోడసాని బాపిరాజు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త క్రీయాశీలక సభ్యత్వం తీసుకొవాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం జనసేన నాయకులు అడబాల మురళి, మట్ట రామకృష్ణ, రుద్రా శ్రీనివాస్, బొప్పన కోటి, కంకిపాటి సువర్ణ రాజు, పదిలం దుర్గారావు, అయినపర్తి శ్రీను, నాయుడు నరేష్, అడపా అన్నవరం, ఆకుల వివేక్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.