పింగళి కి ఘన నివాళులు అర్పించిన జనసేన నాయకులు

రాయచోటి: భారత స్వాతంత్ర సమరయోధుడు, మన జాతీయ జెండా రూపకర్త కీర్తిశేషులు శ్రీ పింగళి వెంకయ్య గారి 146 వ జయంతి సందర్భంగా మంగళవారం రాయచోటి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు, షైక్ రియాజ్ నేతృత్వంలో వెంకయ్య గారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి.. భారత దేశంలో ప్రతిఒక్కరూ ఆయన చేసిన సేవల పట్ల గుర్తెరగాలని పేర్కొన్నారు. అదేవిధంగా జనసేన పార్టీ రామశ్రీనివాస్ మాట్లాడుతూ “స్వాతంత్ర్య సమరయోధులు, సాహితీవేత్త, బహుభాషా కోవిదులు,
భారత జాతీయ పతాకానికి రూపకల్పన చేసి. మన తెలుగువారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఆయన చివరికి తినడానికి ఆహారం లేకుండా చాలా రకాల సమస్యలు ఎదుర్కొని తుది శ్వాస విడిచారు. అటువంటి పరిస్థితి ఏ ఒక్కరికి కూడా రాబోయే తరాల వారికి పృనరావృతం కాకుండా అందరూ భావితరాల భవిశేత్తు దేశం, సమాజం కోసం ఎంతో మంది మహనీయులు చేసిన సేవలు త్యాగాలను గుర్తు చేసుకొవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కొనియాడుతూ…“శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి” సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ వారికి ఘననివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామశ్రీనివాస్, షైక్ రియాజ్, మౌలానా రషీద్ అహ్మద్ ఖాసిమ్, అరిఫ్, షాహిద్, వెంకటేష్, సుబ్బయ్య, హైదర్ తదితరులు పాల్గొన్నారు.