కోరాడ నారాయణరావుని పరామర్శించిన జనసేన నాయకులు

పార్వతీపురం నియోజకవర్గం, పార్వతీపురం మున్సిపాలిటీ 8వ వార్డ్ కౌన్సిలర్ కోరాడ నారాయణరావుని జనసేనపార్టీ నాయకులు పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోరాడ నారాయణరావు ఇంటిని ముట్టడించడం సరికాదని, రాజకీయ విభేదాలు పార్టీలపరంగా ఉండాలి కాని వ్యక్తిగతంగా ఉండకూడదని, అలాగే ఈ సంఘటని జనసేనపార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. ఆయనకి జనసేనపార్టీ తోడుగా ఉంటుందని తెలియజేశారు. చందక అనీల్, రాజాన రాంబాబు, రెడ్డి కరుణ, సిరిపురపు గౌరీ, మానేపళ్ళీ ప్రవీణ్, రెడ్డి నాగరాజు, నడుకురు శ్రీను, వై.ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.