నాగబాబు చిత్తూరు పర్యటనలో భాగంగా జనసేన సమావేశం

పుంగనూరు: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు చిత్తూరు జిల్లా పర్యటన రెండవ రోజులో భాగంగా ఆదివారం జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అధ్యక్షతన పుంగనూరు, కుప్పం, పూతలపట్టు, పలమనేరు, చిత్తూరు, తంభల పల్లె నియోజకవర్గాల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ జనసేన నాయకులు జిల్లా కార్యదర్శి పగడాల రమణ, పుంగనూరు టౌన్, రూరల్ అధ్యక్షులు, నరేష్ రాయల్, విరూపాక్ష, జిల్లా పోగ్రామ్స్ సెక్రటరీ చైతన్య రాయల్, నాయకులు హరీ నాయక్, మోహన్, గణేష్, రమేష్, భూషణ్ రాయల్, మరియు జనసైనికులు పాల్గొన్నారు.