జనసేన పార్టీ ఎప్పుడు జర్నలిస్టులకు అండగా ఉంటుంది

  • నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్, గురు..

నంద్యాల పట్టణంలోని “నేటి రాయలసీమ జర్నలిస్టు ఎలిజబెత్ రాణికి గత రెండు రోజుల క్రితం యాక్సిడెంట్ కావడం జరిగింది..ఈ విషయాన్ని సాటి జర్నలిస్టుల ద్వారా తెలుసుకున్న నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్, గురు లు “దేవనగర్ లోని జర్నలిస్ట్ రాణి” గృహానికి వెళ్లి ఆరోగ్యం పరిస్థితిని అడిగి తెలుసుకొని అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. మా వంతుగా నంద్యాల జనసేన నాయకులు 5000/- వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు.