జనసేన పార్టీ తెనాలి నియోజకవర్గ కార్యాలయం ప్రారంభం

• సకల విజయాలసిద్ధి కాంక్షిస్తూ శ్రీ నాదెండ్ల మనోహర్ కి వేదాశీర్వచనాలు
• పెద్ద సంఖ్యలో పాల్గొన్న పార్టీ ముఖ్య నేతలు

విజయ దశమి పర్వదినాన జనసేన పార్టీ తెనాలి నియోజకవర్గ నూతన కార్యాలయాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రారంభించారు. తెనాలి చినరావూరు పార్క్ రోడ్డులో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య సతీసమేతంగా శ్రీ మనోహర్ గారు నూతన కార్యాలయంలో అడుగుపెట్టారు. అనంతరం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. విజయ దశమి పర్వదినాన కార్యాలయ ప్రారంభోత్సవం శుభసూచికమనీ, జనసేన పార్టీకి, శ్రీ మనోహర్ గారికి సకల విజయాలు సిద్ధించాలని ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, శ్రీ పెదపూడి విజయ్ కుమార్, జిల్లాల అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు, శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, శ్రీ చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, విజయవాడ నగర అధ్యక్షులు శ్రీ పోతిన వెంకట మహేష్, కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, చేనేత వికాస విభాగం ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, తిరుపతి నగర అధ్యక్షులు శ్రీ రాజారెడ్డి, వివిధ జిల్లాలకు చెందిన రాష్ట్ర, జిల్లా కార్యవర్గం సభ్యులు, నియోజకవర్గాల ఇంఛార్జులు, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ శ్రీ నన్నపనేని రాజకుమారి, బీజేపీ నేత శ్రీ పాటిబండ్ల రామకృష్ణ, తెనాలి నియోజకవర్గ నాయకులు శ్రీ బండారు రవికాంత్, శ్రీ ఇస్మాయిల్ బేగ్, శ్రీ పసుపులేటి మురళీకృష్ణ, శ్రీ తోటకూర వెంకటరమణరావు, శ్రీ షేక్ జాకిర్ హుస్సేన్, శ్రీ హరిదాసు గౌరీశంకర్, శ్రీ దివ్వెల మధుబాబు, శ్రీ యెర్రు వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.