జనసేన ప్రజా చైతన్య యాత్ర

బొబ్బిలి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా, విజయనగరం జిల్లా, బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జ్ డా.గిరాడ అప్పలస్వామి జనసేన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా “ఆంధ్రా జనం – పోయాం మోసం” అనే కార్యక్రమాన్ని 14వ రోజు బడంగి మండలం కోడూరు & దొంకేనవలస గ్రామం మండల అధ్యకులు కొల్లి సురేంద్ర, పి.సతీష్, అశోక్, బోగి, గణేష్ అండ్ టీం ఆహ్వానం మేరకు గ్రామంలో ఇంటింటా ప్రచారం చెయ్యడం జరిగింది. బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జ్ డా.గిరాడ అప్పలస్వామి సమక్షంలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీని ముందుకు నడిపిస్తూ, ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కరానికి హామీ ఇస్తూ, ప్రభుత్వం పై పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తు ముందుకు వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు మరియు బొబ్బిలి నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు.