Nellore: కార్పోరేషన్ పోరుకు జనసేన సిద్ధం

*37 డివిజన్లలో బరిలో దిగిన జనసేన అభ్యర్ధులు

నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోరుకు జనసేన పార్టీ సిద్ధమయ్యింది. అధికార పార్టీ నుంచి తీవ్ర ఒత్తిళ్లు, బెదిరింపులకు తట్టుకుని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన డివిజన్లు పోను, మొత్తం 37 డివిజన్లలో జనసేన అభ్యర్ధులను బరిలో దించింది. పార్టీ అభ్యర్ధులంతా ఇప్పటికే ఇంటింటి ప్రచారం మొదలు పెట్టేసినట్టు ఎన్నికల పర్యవేక్షణకు నియమించిన త్రిసభ్య కమిటీ ప్రకటించింది. మెజారిటీ సీట్లు సాధించి మేయర్ పీఠానికి పోటీ ఇవ్వబోతున్నట్టు పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. అధికారపార్టీని బలంగా ఢీ కొట్టేందుకు జనసేన అభ్యర్ధులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను త్రిసభ్య కమిటీ సభ్యులు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, శ్రీమతి గంటా స్వరూప, శ్రీ విజయ్ శేఖర్, నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి తదితరులు వెల్లడించారు.