వరదముంపు ప్రాంతాలలో జనసేన సహాయక పర్యటన

*జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వరదముంపు ప్రాంతాల సహాయక పర్యటన

అమలాపురం రూరల్ మండలం, బండారులంక గ్రామ పరిధిలో వరద నీటిలో 150 పైగా కుటుంబాలు నిస్సహాయ స్థితిలో ఉన్నాయని తెలిసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అమలాపురం జనసేన పార్టీ తరఫున సోమవారం ఆ ప్రాంతాల్లో పర్యటించి, వారికి కొన్ని నిత్యావసరాలు అందజేయడం జరిగింది. రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి బట్టు పండు మరియు స్థానిక జనసైనికుల నేతృత్వంలో ఈ సహాయక పర్యటన జరిగింది. ఇందులో మాజీ మున్సిపల్ ఛైర్మన్ యాళ్ల సతీష్, కంచిపల్లి అబ్బులు, రూరల్ మండల అధ్యక్షులు బట్టు పండు, పడాల నానాజీ, డాక్టర్స్ సెల్ కార్యదర్శి నాగ మానస, వీర మహిళలు తిక్కా సరస్వతి, వాణి, నాయకులు గంగాబత్తుల కిషోర్, పోలిశెట్టి కన్నా, నల్లా వెంకటేశ్వరరావు, బండి మణికంఠ, కొలిసెట్టి తాతాజీ, నిమ్మకాయల రాజేష్ & దుర్గా ప్రసాద్, మహేష్, సతీష్, గన్నవరపు ఉదయ్ భాస్కర్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.