మారేడుమిల్లిలో జనసేన ఆత్మీయ సమావేశం

అల్లూరి జిల్లా, రంపచోడవరం నియోజవర్గం, జనసేన పార్టీ మారేడుమిల్లి మండల అధ్యక్షులు మళ్ళ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం దిశగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముంజమామిడి గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రంపచోడవరం నియోజకవర్గ నాయకులు కుర్ల రాజశేఖర్ రెడ్డి పాల్గొని సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి చేరిన కార్యకర్తలకు కండువాలు కప్పి ఆహ్వానించారు. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అంతా కూడా జనసేన పార్టీకి అనూహ్య స్పందన వస్తుందని, పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్క జనసైనికుడు పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో విజయ భాస్కర్ రెడ్డి, వరహాల్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, అభి, ముత్యాల రెడ్డి, మహాలక్ష్మి రెడ్డి, కృష్ణ మోహన్, పవన్, జోష్, సాయి వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.