తెలంగాణ రాష్ట్రంలో చైతన్యం కలిగిన నియోజకవర్గం: ప్రేమ కుమార్

తెలంగాణ, కూకట్పల్లి నియోజకవర్గం, బాలాజీ నగర్ డివిజన్, వివేక్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ భువనేశ్వరి దేవస్థానము(శివాలయం)లో ప్రత్యేక పూజలు నిర్వహించి, గురువారం బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాదయాత్రను నిర్వహించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమం లో జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధారం రాజలింగం పాల్గొన్నారు. ముందుగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శివాలయం కమాన్ దగ్గర నుండి వివేక్ నగర్, బాలాజీ నగర్, ఓమిని హాస్పిటల్ సర్వీస్ రోడ్, విజయ దుర్గ టిఫిన్ సెంటర్, యల్.ఐ.జి మెయిన్ రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగించారు. అనంతరం ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్రంలో మరొకసారి బిజెపి గవర్నమెంట్ రావాలని అలాగే ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీని గెలిపించాలని కోరారు. ఏ డివిజన్ లో చూసిన ప్రధానమైన సమస్యలు త్రాగునీరు, డ్రైనేజీ, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఈ సమస్యలన్ని పరిష్కరించే విధంగా పనిచేసి చూపిస్తానని మీ అందరికీ విన్నవించుకుంటున్నానని, అలాగే మీ అమూల్యమైన ఓటును గాజు గ్లాస్ గుర్తు మీద ఓటు వేయాలని కోరారు. కూకట్పల్లి నియోజకవర్గం అంటేనే ఈ తెలంగాణ రాష్ట్రంలో చైతన్యం కలిగిన నియోజకవర్గంగా పేరు ఉంది. ఈసారి అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రజలను ఉద్దేశించి అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం, సత్తెనపల్లి జనసేన నాయకులు బొర్రా వెంకట అప్పారావు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.సూర్యారావు, వినోద్ గౌడ్, యంజాల పద్మయ్య, గంధం రాజు, సత్యనారాయణ, ఆకుల రాము, నాగరాజు, ప్రసాద్, యడమ రాజేష్ , కొల్లా శంకర్, నాగేంద్ర, సలాది శంకర్, వినోద్, ప్రవీణ్, నీడి ప్రసాద్, చందు, సాయికిరణ్, రాజు నాయక్, శ్రీకాంత్, కే.ఎం.ఎస్.రెడ్డి, ఆకుల రాము, శంకర్ సెల్వాడి, బిజెపి నాయకులు, జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.