జనసేన విజయ యాత్ర – ఏపి నీడ్స్ పవన్ కళ్యాణ్ 62వ రోజు

శ్రీకాళహస్తి, 62 వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారంలో భాగంగా సోమవారం శ్రీకాళహస్తి పట్టణం నాలుగు మాడ వీధుల్లో పట్టణ అధ్యక్షుడు తోట గణేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. క్రేన్ ద్వారా బారీ గజమాలతో, పూలవర్షంతో, మంగళ వాయిద్యాలతో పెద్ద ఎత్తున వినుతకి జనసైనికులు స్వాగతం పలికారు. పట్టణంలో ప్రచారం నిర్వహించి రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ ని ఆదరించాలని, నియోజకవర్గంలో శ్రీమతి వినుత కోటాని ఆశీర్వదించి, గాజు గ్లాసు గుర్తు కి ఓటు వెయ్యాలని ప్రజలను కోరడం జరిగింది. మార్పు కోసం జనసేన పార్టీ కి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వంలో వ్యాపారస్తులు చితికి పోతున్నారని, తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని, మూడు మూడు మూడు రోజులకు ఏదో ఒక సాకులతో రోడ్లు బ్లాక్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునేలా పూర్తిగా సహకరించిన ఇబ్బందులు అన్ని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తోట గణేష్, ఉపాధ్యక్షులు రవి కుమార్ రెడ్డి, జ్యోతి రామ్, ప్రధాన కార్యదర్శి పేట చిరంజీవి, ప్రమోద్, కవిత, రాజ్యలక్ష్మి, ఐటీ కో-ఆర్డినేటర్ కావలి శివకుమార్, లక్ష్మి, గాయత్రి, సారిక, శారద, శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, తొట్టంబేడు మండల అధ్యక్షులు పేట చంద్రశేఖర్, నాయకులు పెద్ద ఎత్తున నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.