జనసేన గ్రామ కమిటీ సమావేశం

కాకినాడ రూరల్, జనసేన పార్టీ అభివృద్ధి, నిర్మాణం, గ్రామ సమస్యలపై అవగాహనా, ప్రభుత్వ పనితీరు తదితర అంశాలపై గ్రామ కమిటీ సభ్యులకు అవగాహన కల్పించే కార్యక్రమం మూడవ రోజు కాకినాడ రూరల్ మండలం తమ్మవరం గ్రామ కమిటీ వారితో కాకినాడ గొడరిగుంట పంతం నానాజీ స్వగృహం వద్ద గ్రామ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. వారందరికీ అల్పాహారం అందించిన తరువాత నూతన గ్రామ కమిటీ సభ్యులను దుస్సాలువతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపి, వారికీ దిశా నిర్దేశం చేసి, ప్రతి గ్రామ కమిటీ సభ్యులు తమ ఇంటిపై జనసేన జండా ఎగురవేయాలని కోరిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.