పెరిగిన చార్జీలకు వ్యతిరేకంగా కుప్పం జనసేన నిరసన

కుప్పం నియోజకవర్గం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వైకాపా ప్రభుత్వం అడ్డదిడ్డంగా పెంచిన
విద్యుత్ చార్జీలు, ఆర్టీసి బస్సు చార్జీలు కారణంగా ప్రజల నడ్డి విరచడం వేళాపాలా లేని కరెంటు కోతలను నిరసిస్తూ… కుప్పం ప్రజలకు అండగా ఆదివారం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగారైన డా. ముద్దినేని వెంకటరమణ ఆధ్వర్యంలో జనసేన నాయకులతో కలిసి పెద్ద ఎత్తున కుప్పం ఆర్టీసి బస్టాండు ఆవరణలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జితో పాటు, చిత్తూరు జిల్లా కార్యదర్శి రామమూర్తి, నియోజకవర్గ సమన్వయకర్త మంజునాథ్, మండల అధ్యక్షులు హరీశ్, అమీర్, కిషోర్, సుధాకర్, ప్రవీణ్, మండల కార్యవర్గ సభ్యులు మరియు ఇతర జనసైనికులు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.