రచ్చబండలో జనంలోకి జనసేన మాటలు

*గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి.
*గిరిజనులు పండించిన కాఫీకి గిట్టుబాటు ధర కల్పించాలి.
*జనసేన నాయకులు, సాయిబాబా, దురియా, మాదల శ్రీరాములు, అల్లంగి, రామకృష్ణ.

అరకు నియోజకవర్గం, అరకు వేలి మండలం చినలబడు పంచాయతీ పరిధిలో గల దొరవలస గ్రామంలో సాయంత్రం జనసేన పార్టీ ఎక్స్ ఎంపీటీసీ సాయిబాబా, రామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన బృందం ఆయా గ్రామాల్లో పర్యటించారు. ముందుగా ను గ్రామస్తులతో సమావేశమై సమస్యల పట్ల చర్చించారు. ముఖ్యంగా పోడు భూములకు పట్టాలు నేటి వరకు సాగులో ఉన్న గిరిజనులకు ప్రభుత్వం కల్పించలేదని, గిరిజనుల పండించిన కాఫీకి గిట్టుబాటు ధర కల్పించడం లేదని జనసేన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం జనసేన పార్టీ నాయకులు మాదల శ్రీరాములు, సాయిబాబా, రామకృష్ణ మాట్లాడుతూ… ప్రభుత్వం తక్షణమే గిరిజనులు సాగుచేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజనుల పండించిన కాఫీకి గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అనంతరం గిరిజనులతో పాటు జనసేన ఆధ్వర్యంలో సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వానికి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు సంతోష్ కుమార్ సింగ్, గ్రామస్తులు పాల్గొన్నారు.