జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న దివ్యాంగులకు ట్రై సైకిల్ పంపించిన జనసేనాని

భీమవరంలో జూలై 17 వ తారీఖున జరిగిన జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న దివ్యాంగులు పంతాడి జనార్ధన రావు, శ్రీమతి లక్ష్మి దుర్గ ల కష్టం విన్న అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పందించి వారికి తథేకం ఫౌండేషన్ ద్వారా రెండు ట్రై సైకిల్ పంపడం జరిగింది.. వాటిని తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ చార్జి విడివాడ రామచంద్ర రావు ఆధ్వర్యంలో వాటిని దువ్వ గ్రామంలో వారి ఇంటి వద్ద తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుల సమక్షంలో వారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తణుకు మండల అధ్యక్షుడు చిక్కాల వేణు, అత్తిలి మండలం అధ్యక్షుడు దాసం ప్రసాద్, ఇరగవరం మండలం అధ్యక్షుడు ఆకేటి కాశి, లీగల్ సెల్ సెక్రటరీ కొయ్యల విజయ్ కుమార్, పంతం నానాజీ, దువ్వ గ్రామ అధ్యక్షుడు శ్రీరాముల చిన్ని, దువ్వ వార్డ్ మెంబర్లు రుద్రా గణపతి, సముద్రం, జిల్లా మహిళా కోఆర్డినేటర్ కాట్నం విశాలి, వీర మహిళలు తెలగారెడ్డి లక్ష్మీ అనుకుల రమేష్, తులసి, అన్నెం ప్రభు, కొమరవరం పండు, ఎం. సురేష్, టి. చిన్నా, తొంట సత్యనారాయణ, దువ్వ గ్రామ జనసేన పార్టీ కమిటీ సభ్యులు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.