ఆమంచి స్వాములుకు జనసేన స్వాగత ర్యాలీ

కొండపి నియోజకవర్గం: చీరాల నుండి ఆమంచి స్వాములు శనివారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో కొణిదెల పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్న శుభ సందర్భంగా, ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో 6 మండలాల నుండి భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించి మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఆమంచి స్వాములు జనసేన పార్టీలో చేరుతున్నారు అన్న వార్త తెలియగానే ప్రకాశం జిల్లాలో నూతన ఉత్సాహం మొదలైంది. కనీవినీ ఎరుగని రీతిలో కొండేపి నియోజకవర్గంలో ఆమంచి స్వాములు గారికి స్వాగతం సుస్వాగతం అంటూ నినాదాలు చేశారు. 6 మండలాల అధ్యక్షులు, జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.