పూసపాటిరేగ మండలంలో మన ఊరిలో జనవాణి

నెల్లిమర్ల నియోజవర్గం, పూసపాటిరేగ మండలం, పసుపాం గ్రామంలో నెల్లిమర్ల జనసేన నాయకురాలు శ్రీమతి లోకం మాధవి జనంలోకి జనసేనను తీసుకెళ్లడం జరిగింది. జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను మరియు జనసేన పార్టీ యొక్క మేనిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. మరియు ఆయా గ్రామాలలో డిగ్రీ చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు మరియు రోడ్లు, కాలువలు, వీధి దీపాలు సరిగా లేవని, పథకాలు అమలు తీరులో అధికార వైసిపి ప్రభుత్వం పక్షపాతి తీరు వ్యవహరిస్తుందని ప్రజలు వాపోయారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత అధికార వైసిపి ప్రభుత్వానికి పొరపాటున కూడా ఓటు వేయమని ప్రజలు వాపోయారు. శ్రీమతి లోకం మాధవి మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం పనితీరు అసలేమీ బాగాలేదని అర్హులైన లబ్ధిదారులకు పథకాలు చేరటం లేదు మరియు వితంతువులకు వృద్ధులకు పెన్షన్లు రావటం లేదు. మెరుగైన పరిపాలన సామాజిక న్యాయం జనసేనతోనే సాధ్యమని ప్రతి ఒక్క కుటుంబాన్ని నా కుటుంబ సభ్యులుగా భావిస్తూ నిష్పక్షపాతంగా సేవ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు గుడివాడ జమరాజు, ధనంజయ్, గుడివాడ శేఖర్, రెడ్డి సురేష్, బోనుల నర్సింగరావు, ఓమ్మి శ్రీను, కిలారి రమేష్, కోట రాజారావు, ఉమ్మి మణికుమార్, కంది సంతోష్, వాళ్లే వెంకటేష్, ఓమ్మి పద్మ, ఓమ్మి ఝాన్సీ, తాత నాయుడు, ఓమ్మి నరేష్, వాళ్లే సురేష్, ఓమ్మి రామరాజు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.