నెల్లూరు నగరంలో జనసేనలో బారీ చేరికలు

నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి సుబ్బు ఆధ్వర్యంలో అలేఖ్య, రాము, పద్మ తదితరులు జనసేనలోకి చేరారు… జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్, సిటీ ఇన్చార్జ్ సుజయ్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ డివిజన్ నుంచి ఎక్కువ శాతం ప్రజారాజ్యం పార్టీ సమయంలో ఎక్కువ ఓట్లు వచ్చిన సంగతి గుర్తు చేసుకుని.. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకునేవిధంగా జనసేన పార్టీ విధివిధానాలను కళ్యాణ్ గారి ఆశయాలను ప్రతి గడపకు తీసుకెళ్లే విధంగా కార్యకర్తలు పనిచేయాలని జిల్లా అధ్యక్షులు కోరారు.