శెట్టూరు మండలంలో జనసేన-టిడిపి ఇంటింటా ఉమ్మడి ప్రచారం

కళ్యాణదుర్గం నియోజకవర్గం: కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన, టిడిపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు శెట్టూరు మండలంలోని ఐదుకల్లు నుండి యాటకల్లు, గొల్లపల్లి, బసంపల్లి, శెట్టూరు మండల కేంద్రం వరకు రోడ్ షో నిర్వహించి, శెట్టూరు మండల కేంద్రంలో జనసేన-టిడిపి ఇంటింటా ఉమ్మడి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ తరఫున ఇంచార్జ్ బాల్యం రాజేష్, జిల్లా కార్యదర్శులు లక్ష్మీ నరసయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శెట్టూరు మండల అధ్యక్షులు కాంతరాజు, శెట్టూరు మండల ఉపాధ్యక్షులు రామలింగ, కళ్యాణదుర్గం జనసేన వీరమహిళల ఇంచార్జులు మమత, కల్పన, షేక్ తార, పట్టణ అధ్యక్షులు వంశీకృష్ణ, కుందుర్పి మండల అధ్యక్షులు జయకృష్ణ, కళ్యాణదుర్గం ముఖ్య నాయకులు రాజు, అనిల్ పాల్యం, సుధాకర్, చిత్తప్ప, రహుల్ల, కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ మీడియా ఇంచార్జ్ రాయుడు పాల్గొన్నారు.