కాకినాడ రూరల్ లో జనసేన-టీడీపీ పార్టీల ఉమ్మడి ప్రచారం

  • సర్పవరం గ్రామంలో జనసేన-టీడీపీ పార్టీల ఉమ్మడి ప్రచారం

కాకినాడ రూరల్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన-టీడీపీ పార్టీల ఉమ్మడి కార్యాచరణలో భాగంగా కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలోని శెట్టిబలిజ పేటలో ఉమ్మడి మేనిఫెస్టో పై ఇంటింటికి వెళ్ళి చేసిన ప్రచార కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు పుల్ల శ్రీరాములు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులతో కలిసి జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసేన శ్రేణులు, టీడీపీ శ్రేణులు పాల్గొనడం జరిగింది.

  • కొంగోడు గ్రామంలో జనసేన-టీడీపీ పార్టీల ఉమ్మడి ప్రచారం

కాకినాడ రూరల్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన-టీడీపీ పార్టీల ఉమ్మడి కార్యాచరణలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం, కరప మండలం, కొంగోడు గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు నక్క గోవింద్, మండల అధ్యక్షులు బండారు మురళి ల ఆధ్వర్యంలో శెట్టిబలిజపేటలో ఉమ్మడి మేనిఫెస్టోపై ఇంటింటికి వెళ్ళి చేసిన ప్రచార కార్యక్రమంలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ, తెలుగుదేశం నాయకులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, జనసేన శ్రేణులు మరియు టీడీపీ శ్రేణులు పాల్గొనడం జరిగింది.