Warangal: మృతుడి కుటుంబానికి “జనసేన పార్టీ” ఆర్ధిక సహాయం

వరంగల్, నర్సంపేట నియోజకవర్గం ఇటీవల నర్సంపేట పట్టణంలోని 15వ వార్డు వడ్డెర కాలానిలో అనారోగ్యంతో మరణించిన ఆలకుంట వీరస్వామి గారి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున ఏడువేల(7000/-) రూపాయల ఆర్ధిక సహాయాన్ని జనసేన కార్యవర్గ సభ్యుడు శ్రీ ఒర్సు రాజేందర్ అధ్వర్యంలో అందచేయడం జరిగింది. వీరస్వామికి బార్య, పిల్లలు ఒక కూతురు మరియు కుమారుడు ఉన్నారు. ఈ కార్యక్రమానికి జనసేన నియోజకవర్గ నాయకుడు మేరుగు శివ కోటీ యాదవ్ హాజరు అయ్యి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యవర్గ సభ్యులు ఒర్సు రాజేందర్, వంగ మధు, కుండే రాజు కుమార్, కొయ్యడ శశి, డేవిడ్, చరణ్ రాజ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.