దివ్యాంగులకు సైకిళ్ళను పంపిణీ చేసిన కందుల దుర్గేష్

రాజమండ్రి రూరల్: జనసేన పార్టీ మరియు తదేకం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ చేతుల మీదుగా పొట్టిలంక గ్రామానికి చెందిన ముగ్గురు దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ సానుభూతిపరులు మరియు గ్రామ ప్రజలు అధికంగా పాల్గొన్నారు.