ఉగాది పండుగ సందర్భంగా రాజోలు రెల్లి కాలనీలో దుప్పట్లు పంపిణీ

రాజోలు నియోజవర్గం కేశనపల్లి గ్రామ నిస్వార్థ జనసైనికుడు సుంకర రమేష్ విజయభారతిల పెళ్లిరోజు సందర్బంగ రాజోలు గ్రామంలో ఉన్న రెల్లీపేటలో అందరికీ దుప్పట్లు, ఓఆరెస్ డ్రింక్ లు పంచిపెట్టటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజోలు జనసేన ఎంపీటీసీ దార్ల కుమారిలక్ష్మి, బి సావరం వైసీపీ ప్రెసిడెంట్ కడియం పూర్ణచంద్రరావు, బి సావరం జనసేన వైస్ ప్రెసిడెంట్ రావూరి నాగబాబు, రాజోలు టౌన్ జనసేన ప్రెసిడెంట్ కాట్నం రాజు, టౌన్ జనరల్ సెక్రటరీ గురుజు భీమరాజు, చిరుపవన్ సేవాసమితి టౌన్ ప్రెసిడెంట్ యర్రంశెట్టి ప్రసాద్ రాజోలు జనసేన క్రియాశీలక సభ్యుడు సూర్య నంద్యాల, చేగొండి వెంకట కిరణ్ మరియు జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు, ఈ సందర్భంగా సుంకర రమేష్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గ్రామస్తులు కొనియాడడం జరిగింది.