వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలసి పని చేస్తాం

•బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అనంతరం నాదెండ్ల మనోహర్


రాష్ట్రాన్ని జగన్ రెడ్డి ఆయన పార్టీ కలసి అంధకారంలోకి నెట్టేశారని, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అంతా కలసి పని చేస్తామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారితో రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులపై చర్చించినట్టు తెలిపారు. బుధవారం రాత్రి గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ తో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు చర్చలు జరిపారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అంతా కలసికట్టుగా పని చేయాల్సిన అవశ్యకతపై చర్చించినట్టు తెలిపారు. మిగిలిన అంశాలు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో చర్చిస్తామన్నారు.