జనసేన కదిరి పట్టణ ఉపాధ్యక్షులుగా లక్ష్మణ కుటాల

  • అతి సామాన్యులను సైతం నాయకులుగా తీర్చి దిద్దగలిగిన ఏకైక పార్టీ జనసేన

కదిరి నియోజకవర్గం: జనసేన కదిరి పట్టణ ఉపాధ్యక్షులుగా లక్ష్మణ కుటాలను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ కుటాల మాట్లాడుతూ రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం వారికే పదవులు, అధికారం, డబ్బు దర్పం ఉన్న వారికి మాత్రమే రాజకీయం అనే ఈ రాజకీయ రణక్షేత్రంలో ఒక మార్పు కోసం, ప్రజాక్షేమం కోసం అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి కుటుంబరాజకీయాలకు స్వస్తి పలికి పేద, బడుగు, బలహీన వర్గాలు, మధ్య తరగతి ప్రజల అభ్యున్నతి కోసం నిత్యం శ్రమిస్తున్న అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి అడుగుల్లో అడుగులు వేస్తూ ఆయన ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకొని వెళుతున్న నన్ను గుర్తించి నా మీద నమ్మకంతో కదిరి పట్టణ ఉపాధ్యక్షులు నియమంచిన జనసేన పార్టీ అధ్యక్షులు, అధినేత శ్రీ పవన్ కళ్యాణ్, పెద్దలు గౌరవనీయులు పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ టి సి వరుణ్, రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ భవాని రవి కుమార్, నియోజకవర్గం ఇంచార్జీ భైరవ ప్రసాద్, కదిరి పట్టణ అధ్యక్షులు కాయల చలపతి లకు లక్ష్మణ కుటాల కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ బలోపేతం కోసం, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం, అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే వరకూ కృషి చేస్తానని, మీరు నాకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని గ్రామ, పట్టణ, నియోజకవర్గ స్థాయిలో ఉన్న ప్రజాసమస్యలను, పార్టీ నాయకుల దృష్టికి తీసుకొని వాటి పరిష్కారం కోసం నిత్యం శ్రమిస్తానని ఈ నా ఎన్నికలో నాకు సహకరించిన జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జనసైనికులకు, వీరమహిళలకు పేరు పేరు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని లక్ష్మణ కుటాల తెలిపారు.