భారత్-శ్రీలంకల సంబంధాల బలోపేతంపై చర్చించిన నేతలు

భారత్-శ్రీలంక ప్రధానుల మధ్య నేడు వర్చువల్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా రెండు దేశాలకు సంబంధించిన ప్రధానులు ఇద్దరూ పలు కీలక అంశాలపై చర్చించారు. అయితే ఈ చర్చలు వర్చువల్ ప్లాట్ ఫామ్ లో జరగడం విశేషం. ఈ సమావేశం ప్రారంభంలో ప్రధాని మాట్లాడుతూ ఇటీవల జరిగిన శ్రీలంక ఎన్నికల్లో రాజపక్ష ప్రభుత్వం మరోసారి ఘన విజయం సాధించడంతో. ఇరు దేశాల మధ్య సహాయసహకారాలు మరింత బలపడతాయని చెప్పారు. ఇరు దేేశాల మధ్య మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు మరో అవకాశం వచ్చిందని అన్నారు. ఇరు దేశాల ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో మన వైపు చూస్తున్నారని తెలిపారు. వర్చువల్ ప్లాట్ ఫామ్ ద్వారా మోదీ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మరోవైపు, గత ఆగస్ట్ 9న శ్రీలంక ప్రధానిగా రాజపక్స మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈసారి ఆయన బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఇతర దేశాధినేతతో ఆయన చర్చలు జరపడం ఇదే ప్రథమం. ఇరు దేశాల మధ్య అన్ని రంగాల్లో బంధాలను బలోపేతం చేసుకునే దిశగానే ఇరు దేశ ప్రధానులు చర్చలు జరిపినట్టు సమాచారం.