మన పార్టీ – మన బాధ్యత కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం: కామిశెట్టి రమేష్

గురజాల నియోజకవర్గం: సెప్టెంబర్ 2న జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన ఒక్కరోజు సంపాదన, జనసేన కోసం, మన పార్టీ మన బాధ్యత కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 2 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా.. కార్యకర్తలు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ.. మన పార్టీ మన బాధ్యత అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా.. ఒక్క రోజు సంపాదన జనసేన కోసం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారని, తెలియజేశారు. అధికారంలో ఉండి కూడా ఏ పార్టీ చేయనటువంటి పనులు, అధికారం లేకపోయినప్పటికీ కొన్ని కోట్ల రూపాయలు, ప్రజల కోసం ఖర్చు పెడుతూ భావితరాల భవిష్యత్తు కోసం పార్టీని నడిపిస్తున్న అధినేతకు తోడుగా మేము సైతం అంటూ లక్షలాదిమంది స్వచ్ఛందంగా సెప్టెంబర్ 2న పార్టీ అఫీషియల్ గా ఇచ్చిన UPI:7288040505 లేదా 7288040505@UPi ఫోన్ పే, గూగుల్ పే, మరియు పార్టీ అకౌంట్ ద్వారా విరివిరిగా అమౌంట్ వేసి, ప్రతి ఒక్కరూ నేను సైతం అంటూ పార్టీకి అండగా ఉన్నామనే భరోసా నాయకునికి కల్పించే గొప్ప కార్యక్రమాన్ని చేయబోతున్నామని తెలియజేశారు. కావున సెప్టెంబర్ 2న ప్రతి ఒక్క జనసేన అభిమాని, మరియు కార్యకర్త, జనసేనని ఆశయ సాధన కోసం తోడుగా నిలబడాలని కోరారు.