భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమిస్తాం: గురాన అయ్యలు

విజయనగరం: భగత్ సింగ్ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. విప్లవవీరుడు భగత్‌ సింగ్‌ 116వ జయంతిని జనసేన కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళర్పించారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌ సింగ్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. షహీద్‌ భగత్‌సింగ్‌ ఆశయాలను పరిరక్షించేందుకు, సామరస్య, సమానత్వ సమాజాన్ని తీర్చిదిద్దేందుకు జనసేన పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. షహీద్ భగత్ సింగ్, షహీద్ రాజ్‌గురు, షహీద్ సుఖ్‌దేవ్‌ల బలిదానం.. ఎప్పటికీ అన్యాయం, దౌర్జన్యం, అణచివేతలకు వ్యతిరేకంగా ఎదగడానికి స్ఫూర్తినిస్తుందని ఆయన అన్నారు. సమాజంలో నెలకొన్న అన్ని రకాల సామాజిక రుగ్మతలపై యుద్ధం చేయడం యువత నైతిక బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు అడబాల వేంకటేష్ నాయుడు, వజ్రపు నవీన్ కుమార్, ఎమ్. పవన్ కుమార్, పృథ్వీ భార్గవ్, హిమంత్, కంకిపాటి రాజు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.