పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలపై మదనపల్లె జనసేన సమావేశం

మదనపల్లె, సెప్టెంబర్ 2 వ తేదీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు డబ్బు వృధాచేయకుండా ప్రజలకి పనికి వచ్చే విధంగా, ప్రజలు మెచ్చే విధంగా ప్రజల ఆశీర్వాదాలు పవన్ కళ్యాణ్ కు ఉండే విధంగా ఉండాలని సోమవారం కమ్మవీధిలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో మదనపల్లె నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన రాయలసీమ కో కన్వినర్ గంగారపు రామదాసుచౌదరి. సెప్టెంబర్ 2వ తేదీ నీరు గొట్టి పల్లెలో మార్కెట్ యార్డ్ సమీపంలో అన్నదాన కార్యక్రమఒ, ఆపదలో సర్వం కోల్పోయిన వారికి ఆర్థిక చేయూత మరియు రక్త దాన కార్యక్రమం ఇలా ఇంకా కొన్ని మంచి పనులు చేసి దేవుని ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని సీటీమ్ రోడ్ బర్మా వీధి జుంక్షన్లో ఉన్న శివాలయంలో పూజలు చెయ్యాలని కార్యక్రమం కార్యకర్తలకి దశ దిశ నిర్ధేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, జిల్లా లీగల్ సెల్ అమరనారాయణ, రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, జిల్లా జాయింట్ కార్యదర్శి సనాఉల్లా, టౌన్ ప్రెసిడెంట్ శక్తి, మండల ప్రెసిడెంట్ గ్రానైట్ బాబు, నిమ్మనపల్లె మండల ప్రెసిడెంట్ ప్రదీప్ సింగ్, రామసముధ్రం మండల ప్రెసిడెంట్ చంద్రశేఖర్, ఐటి జగదీష్, ఐటి లక్ష్మీ నారాయణ, లక్ష్మీపతి క్రాంతి బంగారం జనార్దన్, మహిళా ప్రధాన కార్యదర్శి రెద్దమ్మ, టైగర్ పద్మావతి ఇంకా పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తల పాల్గొన్నారు.