ప్రమాదంలో గాయపడిన యువతికి ఆర్ధికసాయమందించిన మాడుగుల జనసేన

మాడుగుల నియోజకవర్గం, చీడికాడ మండలం, చీడికాడ గ్రామ యువతి మాధురి ఇటీవల బస్సు ప్రమాదంలో గాయపడిన కారణంగా వైద్య ఖర్చులు నిమిత్తం మాడుగుల నియోజకవర్గ జనసైనికుల సహకారంతో 22000 వేల రూపాయల నగదును వారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ కార్యాలయం చీడికాడలో అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జి.వి మూర్తి, ఈశ్వర్, కృష్ణ, ప్రసాద్, సంతోష్, అంజి, రామారావు, శ్రీను, బాల, సత్యన్నారాయణ, రామకృష్ణ, గణేష్, భానుతో పాటు నాలుగు మండలాల జనసైనికులు పాల్గొన్నారు.