మహాత్ముడు కలలు కన్న స్వరాజ్యం జనసేనతోనే సాకారం: పెండ్యాల శ్రీలత

అనంతపురం, మహాత్మా గాంధి 153వ జయంతిని పురస్కరించుకుని జనసేన పార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి పెండ్యాల శ్రీలత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వతంత్రం సాధించిన నాయకులలో మహాత్మా గాంధీ అగ్రగన్యుడని. సత్యం, అహింస మార్గాలని ఆయుధాలుగా చేసుకుని స్వతంత్ర పోరాటానికై నడుం బిగించి… ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమం వంటి అనేక శాంతియుత పోరాటాలను చేసి భారతీయులను స్వతంత్ర ఉద్యమంలో ఏకం చేసి విదేశీ పాలన నుండి దేశానికి స్వతంత్రం సిద్ధింప చేయటానికి విశేషమైన కృషి చేశారని ఆయన గొప్ప సేవలు నేటి యువతకి స్ఫూర్తిదాయకమన్నారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని గ్రామ స్వరాజ్యం వైపు నేతలు అడుగులు వేయాలని సూచించిన గొప్ప వ్యక్తి మహాత్మ గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవ రాయుడు, నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, అనంతపురం రూరల్ కన్వీనర్ గంటా రామాంజనేయులు నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్, సాదినేని కార్తిక్, ప్రవీణ్, సాయి కుమార్, దేవేంద్ర, వీర మహిళలు శ్రీమతి కాశెట్టి సావిత్రి, గుమ్మడిసాని శిల్పా, లక్ష్మి, శ్రీమతి శ్రావణి, శ్రీమతి శైలజ, శ్రీమతి శ్రీదేవి, శ్రీమతి కుసుమ తదితరులు పాల్గొనడం జరిగింది.