పితాని ఆధ్వర్యంలో “నా సేన కోసం నా వంతు కార్యక్రమం”

ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జి పితాని బాలకృష్ణ తాళ్లరేవు మండలంలో నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో భాగంగా తాళ్లరేవు మండలం జార్జి పేట, నిలపల్లి, తాళ్లరేవు గ్రామాల్లో పర్యటించి, మండల ఒలుపు కార్మిక సంఘం, ఆటో కార్మిక సంఘం, దింపు కార్మికుల సంఘం, కార్పు రెండర్ల సంఘం, భవన కార్మికుల సంఘం, మరియు పెయింటర్స్ సంఘం, వారి యొక్క సమస్యలను తెలుసుకొని వారికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అందరిని ఒక్క అవకాశం జనసేన పార్టీకి ఇప్పించవలసిందిగా కోరినారు ఈ సందర్భంగా కార్మికులు వారి సమస్యలు చాలా వర్ణాతీతంగా ఉన్నాయని వారి గోడుని వెళ్ళబుచ్చుకున్నారు వారికి ప్రభుత్వం నుండి ఏ రకమైన సాయం కూడా ఈ సంఘాలకు అందడం లేదని ప్రతి ఒక్క సంఘము కూడా చెప్పటం ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అర్థం పడుతుంది అందరికీ ఏదో చేసేస్తున్నాము గొప్పగా చెప్పుకుంటున్న వైయస్సార్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరికి కూడా ఏ విధంగానూ కూడా ఉపకారం లేదని వారు గోడును చెప్పుకోవడం జరిగింది దానికి స్పందించి పితాని బాలకృష్ణ జనసేన పార్టీ ఎప్పుడూ మీకు అండగా ఉంటుందని ఒక్క అవకాశం రాబోవు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఇప్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో గుద్దట జమ్మి , మండలాధ్యక్షులు అత్తిలి బాబూరావు, విల్ల వీర, ఉభయగోదావరి జిల్లాల మహిళ కోఆర్డినేటర్ ముత్యాల జయలక్ష్మి, జిల్లా సంయుక్త కార్యదర్శి తాళ్లూరి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి జక్కం శెట్టి పండు, దూడల స్వామి, కర్ణిడి నాని, గెద్దాడ పండు, దవులూరి శ్రీను, రాయుడు గోవిందు, ఆకేటి రవి, సలాది దుర్గ శ్రీనివాస్ కడలి కొండ, పాయసం సాయి, పువ్వల జయప్రకాష్ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.