జగనన్నమోసం కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యండి

పొన్నూరు పట్టణం జనసేన పార్టీ ఆఫీసులో పలువురు జనసేన నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మేము రేపు చేయబోవు కార్యక్రమం “జగనన్న ఇల్లు పేద ప్రజల కన్నీళ్లు’ కార్యక్రమం అధికార పార్టీ వారు టిడ్కో గృహాలు, జగనన్న గృహాలపై వారు చేస్తున్న అన్యాయాలపై ప్రజలకు తెలియజేయడమే మా ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. ఈనెల 12, 13, 14, తారీకులలో మా పార్టీ అధ్యక్షులు వారు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జగనన్న గృహాలపై జరుగుతున్న మోసాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేయాలని మా పార్టీ ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులు మాకు సహకరించి ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన మీడియా సోదరులు కూడా నిలబడతారు అని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో జిల్లా మరియు నియోజకవర్గ మండల నాయకులు పాల్గొన్నారు.