జనసైనికులకు అండగా ఉంటానని భరోసా కల్పించిన మాకినీడి

పిఠాపురం నియోజవర్గం, గొల్లప్రోలు మండలం, చేబ్రోలు గ్రామంలో ఇటీవల యాక్సిడెంట్లో గాయాలకు గురైన మన జనసైనికులు బుద్ధాల శ్రీనివాస్, సకినాల వీరబాబును చేబ్రోలు గ్రామంలో వారి నివాసానికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని పిఠాపురం జనసేన ఇన్ ఛార్జ్ మాకినీడి శేషుకుమారి తెలుసుకున్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అవసరమైతే మెరుగైన వైద్యం కోసం మా హస్బెండ్ డాక్టర్ మాకినీడి వీర ప్రసాద్ గారితో చేయిస్తానని అందరికీ అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో.. పెద్దింటి శివ, బుద్ధాల విష్ణు, సురేష్, వి.బుజ్జి తడాల సతీష్, ఉమ్మడి సురేష్, గొల్లప్రోలు మండల అధ్యక్షులు అమరాది వల్లి రామకృష్ణ, పట్టా శివ, జిల్లా కార్యదర్శి మొగలి అప్పారావు, అడబాల వీర్రాజు, గోపు సురేష్, పుణ్య మంతుల బాబురావు, నెయ్యి కాపుల సురేష్, మేళం బాబీ, కేతినిడి గౌరీ నాగలక్ష్మి, చేబ్రోలు జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.