పరమాత్మ సేవా తపోవన ఆశ్రమం నందు మలిశెట్టి జన్మదిన వేడుకలు

రాజంపేట నియోజకవర్గం: రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ జన్మదిన సందర్భంగా సిద్ధవటం మండలం లోని పరమాత్మ సేవా తపోవన ఆశ్రమం నందు శనివారం వేడుకలను ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా కేక్ కటింగ్ మరియు వృద్ధులకు భోజనం ఏర్పాటు చేయడమే కాకుండా ఆశ్రమంలో నిర్మిస్తున్నటువంటి శ్రీ శ్రీ శ్రీ అన్నపూర్ణమ్మ ఆది బిక్షవు ఆలయం నిర్మాణం కొరకు 50 వేలు విరాళం సమర్పించారు. ఈ సందర్భంగా ఆశ్రమం వ్యవస్థాపకుడు మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ.. చాలా మంచి పని చేశారు, చాలా చాలా సంతోషం మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.