తుడిచెర్ల గ్రామంలో జనసేనలో భారీ చేరికలు

ఉమ్మడి కర్నూలు జిల్లా, నందికొట్కూరు నియోజవర్గం, జూపాడుబంగ్లా మండలంలోని తుడిచెర్ల గ్రామంలో జనసేన మరియు తెలుగు దేశంపార్టీల సమన్వయ జిల్లా అధ్యక్షులు చింతా సురేష్ బాబు అన్న ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా నందికొట్కూరు నియోజకవర్గం జనసేన – తెలుగు దేశం పార్టీల సమన్వయ బాద్యులు శ్రీ నల్లమల రవికుమార్ హాజరై తుడిచర్ల గ్రామ జనసేన నాయకులు ఉల్లక్కి ప్రదీప్ కుమార్ అధ్యక్షతన బాలకృష్ణ, మహేష్, ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ గ్రామంలో యువత, పెద్దలు, జనసేన పార్టీలో పవన్కళ్యాణ్ గారిపై నమ్మకంతో పెద్ద ఎత్తున 25మంది పార్టీలోచేరారు. వీరిని కండువా కప్పి నల్లమల రవికుమార్ పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే రవి కుమార్ మాట్లాడుతూ అధికార వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాలలో విద్య, ఉపాధి, ఉద్యోగరంగాలలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విఫలం అయ్యారని ఏద్దేవా చేశారు. అలాగే స్థానిక వైసీపీ ఎమ్మెల్యేకు ఓటు వేసి గెలిపించిన పాపానికి ప్రజలకి గత నాలుగున్నర సంవత్సరాలనుండి ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కానీ ఎమ్మెల్యేకు నియోజకవర్గ సమన్వయ కర్త మధ్యన వర్గాపోరు వల్ల నియోజకవర్గం ప్రజలు బలియ్యారని స్థానిక ఎమ్మెల్యేపై విరుచుకపడ్డాడు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గం జనసేన నాయకులు మధు, రాజు, పుష్పరాజ్, స్వాములు, పరమంచల రాజు పాల్గొన్నారు. తుడిచెర్ల గ్రామ జనసేన పార్టీ సభ్యులు బొమ్మనా శ్రీను, నర్రానాగన్న, వెంకటేశ్వర్లు, కిట్టు, అజీస్మియా, రమణయ్య, చంద్రబాబునాయుడు, ఆంజనేయులు పెద్దన్న, సయ్యద్, మాలిక్, బాలకృష్ణ, శ్రీను, రామకృష్ణ, వెంకటరమణ, సురేష్, పేరం వెంకటరమణ, కృష్ణయ్య, రాజశేఖర్, సుంకన్న, మహేష్, బొమ్మనా శ్రీను, నాగన్న, మహమ్మద్, రహిమాన్ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేశారు.