అంగన్వాడీల సమ్మెకు దేవర మనోహర్ మద్దతు

తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి టౌన్ లో మంగళవారం అంగన్వాడి కార్యకర్తలు మరియు వర్కర్స్ చేపట్టిన ధర్నాకు మద్దతుగా చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దేవర మనోహర్ మరియు జనసేన నాయకులు పాల్గొని వారి యొక్క సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ప్రతి ఒక్క ఆశ వర్కర్ కి 18000 ఇప్పుడున్న ప్రభుత్వం ప్రకటించింది. దానిపైన వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానన్న జగనన్న గవర్నమెంట్ ఎప్పుడు 11500 ఇస్తున్నారు. 2017 నుండి డిఏ ఇవ్వడం లేదు కానీ మేము 11500 మేము ఎలా బతకాలి అని డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అని అది మాకు ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఈ సమావేశంలో చంద్రగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ దేవర మనోహర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుభాషిని ఆకేపాటి, జనసేన పార్టీ మరియు కాపు సంక్షేమ సేన రైతు విభాగం తిరుపతి జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు మారసాని, హరి రాయల్, పగడాల యువరాజు రాయల్, మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.