జన్నివలస గ్రామం నుండి జనసేనలోకి భారీ చేరికలు

బొబ్బిలి నియోజకవర్గం: రామభద్రపురం మండలం, జనసేన నాయకులు బవిరెడ్డి మహేష్, అల్లు రమేష్ మరియు కనకల శ్యామ్ ఆధ్వర్యంలో జన్నివలస గ్రామం నుంచి 35 కుటుంబాలు వైసీపిని వీడి, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు చేతుల మీదుగా జనసేన పార్టీలో చేరారు. తదనంతరం, టీడీపీ, జేఎస్పీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బేబీ నాయనని మర్యాదపూర్వకంగా కలిసి, కొత్తగా జనసేనలో చేరిన జన్నివలస నాయకులను, జనసైనికులను పరిచయం చేసి ఆ గ్రామ ప్రధాన సమస్యలను తెలియజేయడం జరిగింది.