జనసేనలో చేరిన వైసీపీ నాయకులు

కాకినాడ రూరల్: కరప మండలం, గొర్రిపూడి గ్రామ వైసీపీ నాయకులు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు తీరుపై విసుగుచెంది, ఏ పనులు చేయకపోవడం, మౌలిక వసతులు కల్పించక పోవడంతో ప్రజలకి సమాధానం చెప్పలేక సుమారు 50 మంది జోకా అప్పలరాజు, ఎర్రమనిడి సత్యనారాయణ నాయకత్వంలో వైసీపీకి రాజీనామా చేసి గొర్రిపూడి జనసేన నాయకుల ఆధ్వర్యంలో కాకినాడ గొడరిగుంటలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పుణ్యమంతుల అన్నవరం, అనుకూల రాంబాబు, గండి యారీష్ తదితరులు పాల్గొన్నారు.