అంబులెన్స్లను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
మంత్రి కేటీఆర్ కొవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్ ప్రగతి భవన్లో జెండా ఊపి ప్రారంభించారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 3 అంబులెన్స్ లను, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ 2, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు1 అంబులెన్స్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. అంబులెన్స్లను కొవిడ్ సహాయక చర్యలకు ప్రభుత్వానికి అందజేసిన వారికి కెటిఆర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. కెటిఆర్ జన్మదిదనం సందర్భంగా ఇచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ ఏకార్యక్రమంలో భాగంగా కరోనా బాధితుల కోసం కొవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్ లను గిఫ్ట్ గా ఇచ్చామన్నారు. నిర్మల్, మంచిర్యాల జిల్లాలోని కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలల నిర్వహణలో ఈ అంబులెన్స్ లను ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు.