జనసేన ఆధ్వర్యంలో ఘనంగా మాతృదినోత్సవ వేడుకలు

శేరిలింగంపల్లి నియోజకవర్గం, మదినాగూడ నందు డాక్టర్ మాధవ రెడ్డి ఆధ్వర్యంలో మాతృదినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ మాధవ రెడ్డి ప్రసంగిస్తూ సమాజంలో ప్రతి పౌరుడు మంచి నడవడిక సత్ప్రవర్తనతో మెలగడానికి ప్రతి మాతృమూర్తి యొక్క కృషితో పాటు ప్రతి కుటుంబంలో తల్లి పాత్ర ఎంతో ముఖ్యమైనది ఎంతో విలువైనదని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర వీర మహిళ అధ్యక్షురాలు కావ్య ప్రసంగిస్తూ జనసేన పార్టీ స్త్రీ సాధికారతకు పెద్దపీట వేస్తుందని, జనసేన మహిళల సమస్యల పై ఎల్లవేళలా పోరాటం చేస్తుందని వారికి ఎపుడూ అండగా ఉంటుందని, మరి అదే విధంగా సమాజంలో నేడు జరగుతున్న పరిణామాల దృష్ట్యా ప్రతి కుటుంబంలో ఉన్నత విలువలు పెంపొందించడంలో తల్లి ఎంతో ముఖ్య భూమిక పోషిస్తుంది ఈ సందర్భంగా తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన భావజాలం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై మద్దూరి నాగలక్ష్మి మరియు వారి బృందాన్ని జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అనంతరం కేక్ కటింగ్ చేసి వారికి తులసి మొక్కలతో పాటు వృద్ధులకి చీరలు పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు అరుణ్ కుమార్, వీరమహిళ వెంకటలక్ష్మి, ఉపేందర్, నరసింహ, శ్రవణ్ కుమార్ జి ఎస్ కే, అశోక్, సిహెచ్ శ్యామల, శారద, రేఖ, దుర్గ, పద్మ శిరీష, అంజలి, జయమ్మ, స్వప్న మరియు ఇతర జనసైనికులు పాల్గొన్నారు.