తిప్పల రమణ రెడ్డి ఆధ్వర్యంలో మాతృ దినోత్సవం

గాజువాక, ఆదివారం సాయంత్రం 5గంటలకు గాజువాక నియోజకవర్గం, పెడగంట్యాడ 75వార్డ్, సీతనగర్ గవర్నమెంట్ స్కూల్ వద్ద జనసేన పార్టీ సీనియర్ నాయుకులు తిప్పల రమణ రెడ్డి ఆధ్వర్యంలో గర్భిణీ మహిళలకు పౌష్టిక ఆహారం పంపిణి చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పి.ఎ.సి సభ్యులు కోన తాతరావు విచ్చేశారు. ఈ సందర్బంగా తిప్పల రమణ రెడ్డి మాట్లాడుతు స్త్రీ లేనిదే సృష్టి లేదని అందరు తల్లిని దైవంగా చూసుకోవాలని మనలను చిన్నప్పటినుండి కంటికి రెప్పలా కడుతున్న తల్లి ఋణం తీర్చుకోలేనిది అని అన్నారు మహిళలకు మాతృ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయుకురాలు రొయ్యి రత్నం, కసిరెడ్డి సుజాత, షాలిని, పత్తి రామలక్ష్మి, ములకలపల్లి వంశీ, అప్పలరాజు, జ్యోతి, వీరబాబు, భాస్కర్, శ్రీను మరియు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.