కందుల దుర్గేష్ ను సత్కరించిన మోటూరి దంపతులు

చిందాడగరువు జనసేన పార్టీ ఎం.పి.టి.సి మోటూరి కనకదుర్గ, వెంకటేశ్వరరావు వీరు చేసే సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు కొణిదల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ది.6-08-2022 శనివారం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా సత్కరించే మహాభాగ్యం కల్పించిన కందుల దుర్గేష్ ను రాజమండ్రిలో కలిసి సాలువా కప్పి, పూలదండలు వేసి సత్కరించారు. ఈ అవకాశం కలిగించిన దుర్గేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ మీ దంపతులిద్దరూ ఎల్లప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. మంచి సేవలు చేస్తూ మంచి సేవ గుణం వారని కొనియాడారు. వీరు భవిష్యత్తులో మంచి స్థాయిలోకి వెళ్లాలని మనసారా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *