కందుల దుర్గేష్ ను సత్కరించిన మోటూరి దంపతులు
చిందాడగరువు జనసేన పార్టీ ఎం.పి.టి.సి మోటూరి కనకదుర్గ, వెంకటేశ్వరరావు వీరు చేసే సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు కొణిదల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ది.6-08-2022 శనివారం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా సత్కరించే మహాభాగ్యం కల్పించిన కందుల దుర్గేష్ ను రాజమండ్రిలో కలిసి సాలువా కప్పి, పూలదండలు వేసి సత్కరించారు. ఈ అవకాశం కలిగించిన దుర్గేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ మీ దంపతులిద్దరూ ఎల్లప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. మంచి సేవలు చేస్తూ మంచి సేవ గుణం వారని కొనియాడారు. వీరు భవిష్యత్తులో మంచి స్థాయిలోకి వెళ్లాలని మనసారా అభినందించారు.