పద్మరాజు కుటుంబాన్ని పరామర్శించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కణుపూరు గ్రామ వాస్తవ్యులు జనసేన కార్యకర్త అయిన మారిశెట్టి వెంకటేశ్వరరావు చిన్న కుమారుడు పద్మరాజు గత రెండు సంవత్సరాలుగా బోన్ కాన్సర్ కారణంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ మధ్యనే తుది శ్వాస విడిచారు. కణుపూరు గ్రామ జనసేన నాయకులు మారిశెట్టి త్రిమూర్తులు మరియు కర్రి దొరబాబు ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పద్మరాజు మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బలరామకృష్ణ అందుబాటులో లేని కారణంగా ఆయన సతీమణి జనసేన నాయకురాలు నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి కణుపూరు గ్రామంలోని వెంకటేశ్వరరావు గృహానికి వెళ్ళి సోకసంద్రంలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వీరితో కర్రి దొరబాబు, మారిశెట్టి త్రిమూర్తులు, ముప్పిడి వరప్రసాద్ మంచ్యాల సామియాలు, ముప్పిడి నాగరాజు, ముప్పిడి రాజు, ములపర్తి బాబి, ముప్పిడి యాకోబు తదితరులతో పాటు కణుపూరు గ్రామ జనసైనికులు పలువురు ఉన్నారు.